సమాచార హక్కు చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ డా. గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై ఓరెంటేషన్ ప్రోగ్రాం సమాచార హక్కు చట్ట ఆక్ట్ 2005 వివిధ సెక్షన్లపై జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ డా.శంకర్ నాయక్ హాజరై మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం లో ఉన్న వివిధ సెక్షన్లపై ప్రతి శాఖ అధికారి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో పౌర సమాచార అధికారి హోదా ఫోన్ నెంబర్ సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో 16 కాలం, 8 కాలం చాప్టర్ తో కూడిన రిజిస్టర్ తప్పనిసరి పాటించాలని అన్నారు.
వివిధ శాఖల అధికారులు వివిధ సెక్షన్లపై అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. ప్రాంతీయ భాషలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. సమాచారం కోరిన వ్యక్తులకు 30 రోజులలో మొదటి అప్పిల్ కింద సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, జిల్లా వైద్యాధికారి అప్పయ్య, సిపిఓ ప్రకాష్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.