సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 52 వేల ఎకరాల ఆయకట్టు పారుదలతో ఉన్న భూములకు ఉప ఎన్నికల హామీ ప్రకారం పాత లిఫ్టుల ఆధునికరణకు, MB కెనాల్ కొత్త లిఫ్టులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి, నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి హుజూర్ నగర్ నియోజకవర్గ రైతాంగం తరపున హుజూర్ నగర్ పట్టణ పార్టీ అద్యక్షుడు చిట్యాల అమరనాధ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చేసిన సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.KLN రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, మాజీ చైర్మన్ జక్కుల వెంకయ్య, దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ MPP నర్సింగ్ వెంకటేశ్వర్లు,అట్లూరు హరిబాబు, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, పట్టణ యూత్ అధ్యక్షులు సోమగాని ప్రదీప్, కౌన్సిలర్ గుండా ఫణి కుమారి తదితరులు పాల్గొన్నారు.