ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న ఐదు మందికి స్వల్ప గాయాలు తగిలాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరంతా దైవ దర్శనం నిమిత్తం కాశి నాయన మండలం కేశినేని కొట్టాల గ్రామం నుండి భద్రాచలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
previous post