సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్ర పరిధిలో కొమరబండ జంక్షన్ జాతీయ రహదారి మీద 4 సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు.
జాతీయ రహదారి మీద కొమరబండ జంక్షన్ లో అతివేగంగా, అజాగ్రత్తగా వాహనములను నడిపేవారిని గుర్తించడానికి, రాంగ్ రూట్ లో వాహనాలను నడుపే వారిని గుర్తించడానికి, జాతీయ రహదారి మీద నిబంధనలు ఉల్లంఘించి వాహనములను పార్క్ చేసే వారిని గుర్తించడానికి ఇవి ఉపకరిస్తాయి.
తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, దొంగతనాలు అరికట్టడానికి, ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి కూడా ఈ సి సి కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామని కోదాడ డి యస్ పి ఎ.రఘు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సి.ఐ K. శివరాం రెడ్డి , కోదాడ రూరల్ యస్ ఐ వై. సైదులు, సిబ్బంది డి. ఉపేందర్, ప్రభాకర్ రెడ్డి, సురేష్ , కొమరబండ గ్రామస్తులు మామిడి రామారావు తదితరులు పాల్గొన్నారు.