విజయనగరం కలెక్టరేట్ వద్ద ఈ ఉదయం అలజడి రేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు నకు నిరసనగా బీజేపీ నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కండువ కప్పుకున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పెట్రోల్ డబ్బా పట్టుకుని వంటిపై పోసుకున్నాడు.వెంటనే అంటించుకోబోతున్న తరుణంలో వాసన పసిగట్టిన పోలీసులు వెంటనే అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.
అయినప్పటికీ పోలీసులను తప్పించుకుని పారిపోయే యత్నం చేసాడు. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది తో అతగాడిని పట్టుకుని ఆటో లో. న్ టౌన్ కు తరిలించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీఐలు మురళి, శ్రీనివాసరావు, ఎస్ఐలు కిరణ్ ,ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు, నూకరాజు ఉన్నారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతలు గద్దె బాబూరావు, రెడ్డి పావని లు నిరసనలు తెలిపారు.