29.7 C
Hyderabad
May 4, 2024 04: 08 AM
Slider వరంగల్

విద్యుత్ షాక్ తో ఇళ్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

#help

ములుగు జిల్లా వెంకటా పూర్ (రామప్ప) మండలం లక్ష్మి దేవి పేటలో ఇటీవల విద్యుత్ షాక్ కు గురై ఇళ్లు కాలిపోయి కట్టు బట్టలతో నిరా శ్రేయులు అయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరు పేద కుటుంబంకు చెందిన మూల చిన్న మల్లయ్య (బాబు) సరోజ దంపతులకు సోమవారం శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్  ట్రస్ట్ సభ్యులు 4000/- ఆర్థిక సహాయం అంద జేశారు. ఇల్లు కాలిపోయి కట్టు బట్టలతో ఉండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మాకు ఆర్థిక అందించిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాడి శ నవీన్,ఆది నారాయణ,చిట్యాల రాజశేఖర్,బోడ ప్రవీణ్,గ్రామస్తులు మామిండ్ల సంపత్,రాజు,పాల్గొన్నారు.

Related posts

జంపన్న వాగులో యువకుడి గల్లంతు

Satyam NEWS

ఒక్క సారిగా భగ్గుమన్న రాజధాని రైతులు

Satyam NEWS

లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Sub Editor

Leave a Comment