ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభలు త్వరలోనే జరపాలని యూనియన్ నేతలు నిర్ణయించారు. ఇవాళ అనంతపురం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన యూనియన్ ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. మహాసభల నిర్వహణ, భవిష్యత్ కార్యచరణ పై ఇవాళ జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో యూనియన్ ను బలోపేతం చేస్తూ భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పొరపాటు సాగించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
మహాసభల నిర్వహణపై జరిగిన చర్చలో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. యూనియన్ కు సంబంధించిన అన్ని పత్రికలు, టీవీల బ్యురోలు, యూనియన్ ముఖ్య నేతలు, సభ్యుల అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మార్కండేయులు, ఆనంద్ వర్ధన్, కే పి కుమార్, వార్త బ్యూరో ఇన్చార్జ్ భోగేశ్వర్ రెడ్డి, విశాలాంధ్ర బ్యూరో ప్రదీప్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రసూల్, పయ్యావుల ప్రవీణ్, చౌడప్ప, పట్టుపోగుల రామాంజనేయులు, చల్లా నవీన్ కుమార్, పులశెట్టి చలపతి తదితరులు పాల్గొన్నారు.