41.2 C
Hyderabad
May 4, 2024 15: 18 PM
Slider హైదరాబాద్

బీజేపీపై త‌ల‌సాని ఫైర్‌

Talasani-Srinivas-Yadav-2

వరద బాధితులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సహాయం చేశామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్ష‌పార్టీ బీజేపీ అన‌వ‌స‌ర రాద్ధాంతానికి తెర తీస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో మీ సేవ ద్వారా బాధితులకు సహాయం చేస్తుంటే స‌హాయాన్ని బీజేపీ అడ్డుకుంద‌ని ఆరోపించారు.


కొన్ని రాజకీయ పక్షాలు దుర్మార్గమైన ఆలోచనతో.. ఎలెక్షన్ కమిషన్ పై ఒత్తిడి చేసి వరద సహాయం నిలిపివేసి, పేదల ఉసురు పోసుకున్నాయ‌న్నారు.


గతంలో కాంగ్రెస్ ఏమి చేసిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. స‌రే వ‌ర‌ద‌ముంపు స‌హాయంలో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాల‌ని బీజేపీ పార్టీని ప్ర‌శ్నించారు. రెచ్చకొడితే రెచ్చి పోయేవాళ్ళు ఎవరు లేర‌న్నారు. రెండు జాతీయ పార్టీలు.. మీ బలం బలగం ఉంటే వేరే పార్టీ వారిని చేర్చుకొని టికెట్లు ఇవ్వ‌ద్ద‌ని త‌ల‌సాని ఎద్దేవా చేశారు.

Related posts

టెలిపోన్ ద్వారా స్పంద‌న‌ నిర్వ‌హించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి “స్పందన”

Satyam NEWS

అధికారులు పనితీరు పై ఎమ్మెల్యే కోలగట్ల అసహనం..!

Satyam NEWS

Leave a Comment