కరోనా థర్డ్ వేవ్ పుణ్యమా అని విజయనగరం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా…క్రమం తప్పకుండా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ఈ సారి కూడా నిర్వహించింది. అయితే ప్రత్యేకించి బాధితులు జిల్లా పోలీస్ శాఖ కార్యాలయానికి రాకుండా…కేవలం ఫోన్ నెంబర్ ద్వారా బాధితుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఈ మేరకు 08922276163 నెంబర్ ద్వారా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్ పి దీపిక “టెలీ స్పందన” నిర్వహించి, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ .సత్యనారాయణ రావు, సీఐలు డా బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
previous post