మూడు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ నకు చెందిన లారీ డ్రైవర్ నలువాల శంకర్ కుటుంబాన్ని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆదుకున్నారు.
ఈ సందర్భంగా బుధవారం శంకర్ కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. ట్రస్ట్ తరుపున 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్ లో కూడా శంకర్ ఇద్దరు కూతుళ్ళకు తమ సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమ్మరి శంకర్,మధు మహేష్, డాక్టర్ రవీందర్,నాగుల చంద్రశేఖర్, గొంగళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య పరిస్థితి బాగాలేని బొడిగే శ్రీనివాస్ సతీమణి వినోద కుటుంబానికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఊరడి రవి రూ.5000 ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో బొడిగే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, ఊరడి రవి, A.T.యాదవ్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
గుమ్మడి ప్రకాష్ జ్ఞాపకార్ధం గుమ్మడి శ్రీనివాస్ మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది పేదలకు మాంసాహార భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు గుమ్మడి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.