42.2 C
Hyderabad
May 3, 2024 16: 31 PM
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడు లో స్వటిక లింగ స్పర్శ దర్శనం

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో వేంచేసియున్న ఉమా విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కోనేటిలో ఉన్న స్పటిక లింగ రూప మహామహేశ్వర స్వామి వారి స్పర్శ దర్శనం ఆలయ నిర్వహకులు కల్పించడంతో భక్తులు తండోపా తండాలుగా వచ్చి స్వామివారిని చేతితో స్పర్శ దర్శనం చేసుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి మరియు రెండవ కార్తిక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ పురహితులు ఫణి శర్మ మాట్లాడుతూ స్పటిక లింగ చేతితో స్పర్శ దర్శనం స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. నేటి నుండి వచ్చే శనివారం వరకు ఈ దర్శనం కలుగును అనంతరం స్వామివారిని కోనేటిలో జలంతో నింపేయడం జరుగుతుందని తెలిపారు

Related posts

కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

Murali Krishna

“మన బస్తీ- మన బడి” కార్యక్రమం పనుల్లో నాణ్యత తగ్గకుండా చూడండి

Satyam NEWS

మోర్ క్రాప్: నియంత్రిత పంటలతో అన్నదాతలకు మేలు

Satyam NEWS

Leave a Comment