నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను, కరోనాతో మరణించిన వారి కుటుంబాలను మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.
కరోనా బారిన పడి మృతి చెందిన డాక్టర్ సిద్దన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆస్తమాతో మృతి చెందిన ఆల్లంపల్లి కుమారస్వామి కుటుంబాన్ని జూపల్లి పరామర్శించి వారిని ఓదార్చారు.
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త స్వామి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం తో వారిని పరామర్శించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ నాథ్ ను, కరోనాతో మృతిచెందిన మధుసూదన్ కుమారుడు టీచర్ సతీష్ ను ఆయన పరామర్శించారు.
అదేవిధంగా ఆకుతోట కిరణ్ తండ్రి శంకరయ్య అనారోగ్యంతో ఉండగా వారి ఇంటికి వెళ్లిన జూపల్లి పరామర్శించారు.