ఆంధ్రప్రదేశ్ కు చెందిన పురందేశ్వరి, తెలంగాణ కు చెందిన డి కె అరుణలకు బిజెపి పెద్ద పీట వేసింది. భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కొత్తరూపు కల్పించేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ కార్యవర్గంలో తెలంగాణ నేత డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు.
దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలుగునేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు.