తన వద్దకు వచ్చిన రైతుకు తానున్నానంటూ భరోసా ఇచ్చి హైకోర్టు ద్వారా రైతును గెలిపించారు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ… తద్వారా దగాపడ్డ రైతుకు న్యాయం జరిగేలా చూశారు. ఈ సంఘటన ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే రైతు భూమిని కొల్లగొట్టేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు ప్రయత్నించారు.
ఇది అన్యాయమంటు బాధిత రైతు గగ్గోలు పెట్టాడు. ఏమాత్రం కనికరం చూపలేదు. అతని రోదన అరణ్య రోదనే అయింది. అధికారులను సంప్రదించినా న్యాయం జరగలేదు. రామాంజనేయులు కు ఆశాదీపం లా కనిపించారు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల.. ఆ రైతు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనను సంప్రదించారు. మాజీ ఎమ్మెల్యే ముందు తన గోడు వెళ్ళబోసు కున్నాడు. ఆ రైతు బాధను అర్థం చేసుకున్న గోనుగుంట్ల తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
వెంటనే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆ రైతు పక్షాన న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వెంటనే ఆ రైతు తరఫున హైకోర్టును ఆశ్రయించారు. తన సొంత ఖర్చులతో ఆయన రైతు సమస్యను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఆమెరకు న్యాయ న్యాయాలను పరిశీలించిన హైకోర్టు బాధిత రైతు పక్షాన స్టే ఇచ్చింది. భవిష్యత్తులో ఆ రైతుకు ఎలాంటి అన్యాయం జరగకుండా హైకోర్టు ఉత్తర్వులను తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కు రైతు రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు.హైకోర్టు ఉత్తర్వుల కాపీని గోనుగుంట్ల సూర్యనారాయణ రైతుకు అందజేశారు.