జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవి జన్మనక్షత్రం రోజు అయిన శ్రీపంచమి వేడుకలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి.
మహామండపం మెట్లమార్గం ద్వారా విద్యార్థులు ఉచిత క్యూలైన్లో ప్రవేశించి చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారిని విద్యార్థులు దర్శించుకునేందుకు వీలుగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు దేవస్థానం ఉచిత దర్శన సౌకర్యం కల్పించింది.
దేవస్థానం ఈవో సురేష్బాబు మహామండప మెట్ల మార్గం, క్యూలైన్లు, విద్యార్థులకు పంపిణీ చేసే పెన్నులు, రక్ష కంకణాల ఏర్పాట్లను పరిశీలించారు.
సేవా సిబ్బంది 50వేల మంది విద్యార్థులకు సరిపడా సిద్ధం చేశారు.