23.7 C
Hyderabad
May 8, 2024 03: 17 AM
Slider ఖమ్మం

రూ.1.35 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన

#puvvada

ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.1.35 కోట్లతో నిర్మించనున్న పలు అభివృధ్ధి నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు. 25వ డివిజన్ అజరయ్య నగర్ లో గల మున్సిపల్ కమ్యూనిటీ భవనం పై రూ. 45 లక్షలతో రెండవ అంతస్తు నిర్మాణం మరియు మొదటి అంతస్తు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. 27వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో రూ.45 లక్షలు, 52వ బర్హన్ పురం రూ.45 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1.35 కోట్లతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్ధాపనలు చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్, లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్లు గోళ్ళ చంద్రకళ, బుర్రి వెంకటేశ్వర రావు, కర్నాటి కృష్ణ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ డిఈ , సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.

Related posts

ఆదిదాస్ బూట్ల కంపెనీకి అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

చెంచులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన

Satyam NEWS

“మాతృదేవోభవ”(ఓ అమ్మ కథ) పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!!

Satyam NEWS

Leave a Comment