అంబర్పేట నియోజకవర్గం గోల్నాక సీజన్ పద్మశాలి సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు, కత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు ఇక్కడకు విచ్చేసి భోజనాలు స్వీకరిస్తాన్నారని తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళల ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్