భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు శాఖ సాయం అందించింది. వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సుంచు మల్లమ్మ, మైస సదయ్య, కళ్లెపు పైడి, కళ్లెపు సౌడలి, ఇండ్ల సౌడలి భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల పాలయ్యారు. ఇళ్లలోకి నీరు వచ్చి వారు పడుతున్న ఇబ్బందులు చూసిన ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అల్లెం అప్పయ్య సూచనలతో ఇండియన్ రెడ్ క్రాస్ మెంబర్ బండి ఈశ్వర్ సాయం అందించారు. వారికి టర్పాలిన్ కవర్లు పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు ఎప్పుడు అండగా ఉంటుంది అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు బండి ఈశ్వర్ బాధితులకు తెలియచేశారు.
previous post