30.7 C
Hyderabad
May 5, 2024 04: 14 AM
Slider రంగారెడ్డి

మేడిపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

#uppalasrinivasagupta

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గం లోని మేడిపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమావాస్య నాడు దాదాపు 500 మందికి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ లందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 200 మంది ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, సెక్రెటరీ కె ప్రకాష్, ట్రెజరర్ ఈ రాంబాబు, భువనగిరి శ్రీధర్, పెద్ది గిరీష్, వెంకటేష్, ఐ వి ఎఫ్ రాష్ట్ర యువజన సంఘం కార్యదర్శి నరేష్ గుప్తా పాల్గొన్నారు.

Related posts

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం: ఒకరి మృతి

Satyam NEWS

జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్

Satyam NEWS

అవకాశం వచ్చింది దోచేసుకుంటున్నారు

Satyam NEWS

Leave a Comment