విద్యల నగమైన విజయనగరం…కళలకు కూడా ప్రసిద్ది చెందినదే. నగరంలో ఉద్భవించింని ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ (ఎఫ్ఎఫ్ఏ) త న 627 సంగీత కార్యక్రమంలో బాగంగా ఈసారి వీణా కచేరీ నిర్వహిస్తోంది. ఈ మేరకు నగరంలోని రింగ్ రోడ్ లో జ్ఙాన సరస్వతి దేవాలయంలో..శ్రీ నాదవర్ధిని సంగీతాలయం ద్వారా వీణా ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఈ మేరకు ప్రముఖ వీణా విధ్వంసురాలు చుక్కాబాలసరస్వతిని శ్రీ వీణా నాదవర్ణినితో ఎఫ్ఎఫ్ఏ,శ్రీ శారద సేవా సంఘం లు సత్కరించనున్నారు. ఈ సందర్బంగా ఎఫ్.ఎఫ్.ఏ కార్యదర్శి డా..మండపాక రవి ఈ విషయాన్ని తెలియ చేసారు. విద్యల నగరమైనవిజయనగరంలో కళలలో పలువురు బాగా రాణిస్తున్నారన్నారు. తమ సంస్థ ద్వారా అలాంటి కళాకారులచే సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే శ్రీ శారద సేవా సంఘం ఆధ్వర్యంలో జ్ఙాన సరస్వతి టెంపులో ఈ నెల 18న సాయంత్రం 5 నుంచీ ఏడుగంటలకు వీణా వాయిద్య కచేరి ఏర్పాటు చేసామని తెలిపారు.