ఈ నెల 21న,ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ విజయవంతం కోసం ప్రచారం నిమిత్తం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెండు ప్రచార ప్రధాన రథాలను ఏర్పాటు చేశారు.
గురువారం ప్రచార రథాలను హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ప్రారంభించి,ప్రచార కరపత్రాలను ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు మండవ వెంకటేశ్వర్లు, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మాలోతు నాగు నాయక్,గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కేసరి నాగయ్య ముదిరాజ్,టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి,కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్,మేకల రామారావు యాదవ్,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల సైదులు,బిసి సెల్ రాష్ట్ర నాయకుడు గుండు వెంకటేశ్వర్లు గౌడ్,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతా వెంకటేశ్వర్లు,జింకల కృష్ణ ముదిరాజ్,విద్యార్థి సంఘం నాయకులు, తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్