సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పరిధిలోని జామాల తండ (పాత తండ) గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు”ఓజో ఫౌండేషన్”వ్యవస్థాపకుడు రఘు రాకతో గిరిజన యువకులలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు చేశారు.
ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రఘు మాట్లాడుతూ హోలీ పర్వదినాన నిరుద్యోగులకు శుభవార్త తెలియజేశారు.’ఓజో ఫౌండేషన్’ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ప్రభుత్వ నియామకాలలో యువత విజయం సాధించే విధంగా అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఉచితంగా గ్రూప్ 1,2,3,4,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ నిరుద్యోగ యువత భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులగా విజయం సాధించే విధంగా ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాత తండ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్