జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో గల శ్రీ కోదండ రామాలయంలో సోమవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారుల మూలవిరాట్లకు, ఉత్సవ విగ్రహాలకు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పంచామృతాభిషేకాలు మరియు నూతన వస్త్ర అలంకరణలు పుష్పాలంకరణలు, అష్టోత్తర శతనామాలు, మహా మంగళహారతి, తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహిస్తున్నారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారా ప్రవేశము చేసి స్వామివారిని దర్శించుకుని, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని బీచుపల్లి కోదండ రామాలయం ఆలయం మేనేజర్ సురేంద్ర రాజు కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా అందరి పై ఉండాలని తెలియజేశారు.