39.2 C
Hyderabad
May 3, 2024 12: 37 PM
Slider మహబూబ్ నగర్

శ్రీశ్రీశ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రం లో వైకుంఠ ఏకాదశి

#beechupalli

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో గల శ్రీ కోదండ రామాలయంలో సోమవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారుల మూలవిరాట్లకు, ఉత్సవ విగ్రహాలకు ఉదయం  బ్రహ్మ ముహూర్తంలో పంచామృతాభిషేకాలు మరియు నూతన వస్త్ర అలంకరణలు పుష్పాలంకరణలు, అష్టోత్తర శతనామాలు, మహా మంగళహారతి, తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహిస్తున్నారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారా ప్రవేశము చేసి స్వామివారిని దర్శించుకుని, స్వామివారి  తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని బీచుపల్లి కోదండ రామాలయం ఆలయం మేనేజర్ సురేంద్ర రాజు కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా అందరి పై ఉండాలని తెలియజేశారు.

Related posts

ప్రాణం పోయినా గుడిసెలను ఖాళీ చెయ్యం

Satyam NEWS

నల్లగొండలో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ ముఠా అరెస్ట్

Satyam NEWS

మద్యం అక్రమంగా తరలిస్తున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

Leave a Comment