28.7 C
Hyderabad
May 6, 2024 10: 05 AM
Slider వరంగల్

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

#mulugu

ములుగు జిల్లా కేంద్రానికి సుభాష్ నగర్ కాలనీకి చెందిన గరిగే శ్రీనివాస్ ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గరిగే శ్రీనివాస్ మృతి పట్ల ఇంటర్మీడియట్ మిత్రులు దీనికి తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు. ఆర్ధికంగా చతికిలబడిన ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాల్యమిత్రుని కుటుంబానికి తోటీ స్నేహితులు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. 1983-1985 ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరానికి చెందిన మిత్రులందరు తోచినంత ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబ సభ్యులకు 91 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇటీవల కాలంలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మిత్రులు వారి కుంటుంబికులను పరమర్శించారు. ఆపదలో ఉన్న తోటి మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవడం  మిత్ర బృందాన్ని పలువురు ప్రశంసించారు.  శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహయం చేసి మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గరిగే శ్రీనివాస్  మిత్రులు యాసం రవికుమార్, చింతనిప్పుల బిక్షపతి, సిరికొండ బలరాం, సిద్ధోజు లక్ష్మణాచారి, పినిగాని ఆత్మ రావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ సారి పోలీసు “స్పందన” ప్రత్యేకంగా…!

Satyam NEWS

Analysis: గతి తప్పిన రైతు ఉద్యమం

Satyam NEWS

26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

Satyam NEWS

Leave a Comment