సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం కేంద్రంలోని శ్రీ మాత చారిటబుల్ ట్రస్ట్ త్రిశత్యాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఆదివారం నాడు సకలజన సంరక్షణార్థం, విశ్వమానవ కళ్యాణం కోసం, షడ్వీధ ఈతిబాధా నివారణార్థం, లక్ష్మీ గణపతి అనుష్టాన పూర్వక గణపతి పంచా ఆవరణ అర్చన సహిత గణపతి అధర్వణ శీర్షీణ పూర్వక సహస్ర మోదక హోమ మహోత్సవం జరిగింది.
బ్రహ్మశ్రీ వేదమూర్తులు శత చండీ యాగం కర్త కొంకపాక రాధాకృష్ణమూర్తి శర్మ సీతా కుమారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద ఘనాపాటీలు, స్మార్త,ఆగమ పండితులు తదితరులు పాల్గొన్నారు.