గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయం వెనుక ఉన్న మున్సిపల్ దుకాణాల సముదాయం ఎదుట వాతావరణం ఓపెన్ బార్ను తలపించే విధంగా ఉంది.
మెట్ల మీద కూర్చొని బహిరంగంగానే మద్యం తాగేస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూడా ఇక్కడ మద్యం సేవిస్తూనే ఉంటున్నారని పలువురు స్థానికులు చెబుతున్నారు.
మందుబాబులు ఇలా గ్లాసుల మోత చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తోన్నారని పలువురు ప్రజలు మండిపడుతోన్నారు.
ఇప్పటికైనా బహిరంగంగా మద్యం సేవించే మందుబాబులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.