ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు కంటే అత్యంత భయంకరమైన రీతిలో జార్ఖండ్లో మరో సంఘటనను జరిగింది. సాహిబ్గంజ్లోని బోరియా సంతాలిలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వెనుక మానవ అవయవ ముక్కలు కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం కలిగింది. శనివారం సాయంత్రం అంగన్వాడీ కేంద్రం వెనుక ఓ మహిళ కాలు, ఛాతీలోని కోసిన ముక్కలను కుక్క తింటూ ఉండడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే దిల్దార్ అన్సారీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాహిబ్గంజ్లో దొరికిన శరీర భాగాలు 22 ఏళ్ల రబికా పహాడిన్ విగా గుర్తించారు. ప్రేమ వివాహం తర్వాత, రబికా పహాడిన్ తన భర్త దిల్దార్ అన్సారీతో కలిసి బెల్టోలా ఇంట్లో నివసించేది. పెళ్లయిన కొద్ది రోజులకే దిల్దార్ తన భార్యతో గొడవ పడేవాడు. చివరకు ఒక పథకం ప్రకారం భార్యను హతమార్చి, కరెంటు కట్టర్తో శవాన్ని 12 ముక్కలుగా నరికేశాడు. అనంతరం అంగన్వాడీ కేంద్రం వెనుక పడేశాడు. దిల్దార్కి రబికా రెండో భార్య అని కూడా తేలింది.
ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న అఫ్తాబ్ పూనావాలా, గొడవల తర్వాత తన స్నేహితురాలు శ్రద్ధాను దారుణంగా హత్య చేశాడు. దీని తర్వాత, అతను శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, ఆ ముక్కలను 18 రోజుల పాటు ఫ్రీజర్లో ఉంచాడు. అతను నెమ్మదిగా మృతదేహం ముక్కలను అడవిలో పడేశాడు. ఈ హత్యపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అదే తరహాలో ఈ హత్య కూడా జరగడం సంచలనం కలిగించిది.