27.7 C
Hyderabad
May 4, 2024 08: 31 AM
Slider ముఖ్యంశాలు

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి

#tirumala

తిరుమలలోని అలిపిరి మార్గంలో మృతి చెందిన చిన్నారి లక్షిత మృతిపై సస్పెన్స్ వీడింది. లక్షిత మృతదేహానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. చిన్నారి మృతికి పులి దాడే కారణమని తేల్చారు. చిరుత పులి దాడి చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు గుర్తించారు. లక్షిత ఎలుగుబంటి దాడిలో మరణించిందా.. లేక పులి దాడిలో మృతి చెందిందా అన్నా అనుమానం వ్యక్తం కాగా.. పోస్ట్ మార్టం అనంతరం లక్షిత మృతికి కారణం చిరుత దాడే అని డాక్టర్లు తేల్చారు. కాగా, లక్షిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి కావడంతో నెల్లూరులోని సొంత గ్రామానికి మృతదేహాన్ని తరలిస్తున్నారు.

Related posts

చిన్నారి చైత్ర హంతకుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలి

Satyam NEWS

న్యూ ఫైండింగ్: ఢిల్లీ అల్లర్ల వెనుక ఉగ్రవాదుల హస్తం

Satyam NEWS

జగనన్న కాలనీ ఇళ్ళకి 5లక్షల రూపాయలు ఇవ్వాలి

Bhavani

Leave a Comment