తిరుమలలోని అలిపిరి మార్గంలో మృతి చెందిన చిన్నారి లక్షిత మృతిపై సస్పెన్స్ వీడింది. లక్షిత మృతదేహానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. చిన్నారి మృతికి పులి దాడే కారణమని తేల్చారు. చిరుత పులి దాడి చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు గుర్తించారు. లక్షిత ఎలుగుబంటి దాడిలో మరణించిందా.. లేక పులి దాడిలో మృతి చెందిందా అన్నా అనుమానం వ్యక్తం కాగా.. పోస్ట్ మార్టం అనంతరం లక్షిత మృతికి కారణం చిరుత దాడే అని డాక్టర్లు తేల్చారు. కాగా, లక్షిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి కావడంతో నెల్లూరులోని సొంత గ్రామానికి మృతదేహాన్ని తరలిస్తున్నారు.
previous post