ఖమ్మం జిల్లా ఖమ్మం సిటీలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ విషయాన్ని జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలియజేశారు. ఖమ్మం నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వ స్థలాన్ని సేకరించామన్నారు. 2023-24లో కళాశాల ప్రారంభం కానుండగా, ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నామని ఆయన చెప్పారు.
previous post
next post