కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ యువతి అదృశ్యం అయినట్టు కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎస్.హెచ్.ఓ కథనం ప్రకారం.. పట్టణంలోని గోసంగి కాలనికి చెందిన అండ్రాసి అనిత(19) ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. యువతి తల్లితండ్రులు ఆమె గురించి చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా కూడా ఆచూకీ లభించలేదు. దాంతో పోలీస్ స్టేషన్లో తమ కూతురు కనబడటం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. యువతి ఇంటి నుండి వెళ్ళినప్పుడు ఈమె బ్లూ కలర్ టాప్, తెలుపు రంగు లెగిన్ ధరించి ఉందని, ఎడమ చేతిపై అమ్మానాన్న అక్షరాలతో పచ్చబొట్టు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. ఇంటినుంచి వెళ్లినప్పటి నుంచి యువతి ఫోన్ కూడా స్విచాఫ్ అయి ఉందని, యువతి ఆచూకీ ఎవరికైన తెలిస్తే కామారెడ్డి పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు చోరీ
కామారెడ్డి పట్టణంలోని ఆర్యనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాలనీకి చెందిన తన్నీరు శేఖర్ అనే వ్యక్తి ఇంటిలోకి రాత్రిపూట దొంగతనంగా ప్రవేశించి ఇంటిలో ఉన్న మూడు లక్షల 50 వేల రూపాయల నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులను, రెండు లాప్ టాప్ లను దొంగలించారు. తన్నీరు శేఖర్ కుటుంబం ఇంటికి తాళం వేసి గత 18 వ తేదీన తిరుపతికి వెళ్లారు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. శేఖర్ వాళ్ళ అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి