తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలపై శుక్రవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిలో మేఘరెడ్డి వర్గీయులతో సమాలోచనలు జరిపారు. శుక్రవారం ఆయన వనపర్తి పట్టణంలోని తిరుమల హిల్స్ లోగల మేఘరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. నివురు కప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ప్రజాప్రతినిధుల, నాయకుల, ప్రజల నాడీకి అనుగుణంగా మనం వ్యవహరించాలని ప్రతినిత్యం ప్రజల్లో ఉంటేనే అది సాధ్యమైతుందని వారు నిర్ణయించుకున్నారు. మరో పది రోజుల్లో తమ కార్యాచరణ రూపొందిస్తామని అప్పటివరకు పార్టీల ప్రసక్తి పక్కన పెడదామని వారు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి పెద్దమందడి ఎంపిపి మెగా రెడ్డి పెద్దమందడి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్య రెడ్డి కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్, తిరుపతిరెడ్డి, నరేష్, తిరుపతయాదవ్, మన్నెంకొండ, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్