33.7 C
Hyderabad
April 29, 2024 02: 44 AM
Slider వరంగల్

అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

#ambedkar

ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి.చాంద్ పాషా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో నాయకుడు కాదని, భారత దేశం మొత్తం గర్వించదగ్గ తత్వవేత్త అని అన్నారు.

అంబేద్కర్ జీవితం మొత్తం అంటరానితనం, అస్పృశ్యతపై పోరాడి బానిస సంకెళ్లను తెంచుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇచ్చి పౌరులకు సమానత్వాన్ని ప్రసాదించిన ఘనుడు అని కొనియాడారు. నిజంగా అంబేద్కర్ త్యాగ ఫలమే మనమందరం ఈ స్థితిలో ఉండడానికి కారణమని తెలిపారు. ఒక మనిషిని సాటి మనిషే అంటరాని వాడిగా,అస్పృశ్యుడిగా చూస్తూ ఒక జంతువు కంటే హీనంగా పరిగణిస్తున్న తరుణంలో అంతులేని పరిజ్ఞానంతో, మొక్కవోని ధైర్యంతో ఎస్సీ,ఎస్టీ,బిసి మైనార్టీలకు స్వేచ్ఛ, సమానత్వం,స్వాతంత్ర్యం ప్రసాదించి చీకటి నుండి వెలుగులు నింపిన ఒకే ఒక్కడు అంబేద్కర్ మాత్రమేనని స్మరించుకోవడం నిజంగా అద్వితీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి,బాదం ప్రవీణ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రఘు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనిల్, ఎస్సీసెల్ మండలఅధ్యక్షుడు మట్టెవాడ తిరుపతి,బిసిసెల్ మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్,మైనార్టీ సెల్ జిల్లా నాయకులు కుతుబుద్దీన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయ కులు జన్ను రవి,నద్దునూరి రమేష్,కోగిల రాంబాబు, బోడ సతీష్,ఓరుగంటి కృష్ణ, మాదారపు రాజు,కొలేపాక రాజేందర్,పెండల రామ స్వామి, వుల్లరావు,శ్రావణ్, శర్ఫోద్దిన్,గుంటోజు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్ ప్రయిజ్: జర్నలిస్టు మూర్తికి ఇంకా తగ్గలేదా?

Satyam NEWS

బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం

Satyam NEWS

రోత పుట్టిస్తున్న నగరి రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment