28.7 C
Hyderabad
May 5, 2024 08: 40 AM
Slider గుంటూరు

నవతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా డా॥గోదా రమేష్ కుమార్

#navataramparty

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ కు చెందిన డా॥గోదా రమేష్ కుమార్ ను నవతరంపార్టీ జాతీయ కార్యదర్శిగా  నియమించినట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈరోజు స్థానిక చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో నవతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా డా॥గోదా రమేష్ కుమార్ కు నియామకపు పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నవతరం పార్టీ అభివృద్దికి అహర్నిశలు కష్టపడుతూ ఇప్పటికే నవతరం పార్టీ  నరసరావుపేట ఎమ్మెల్యేగా, తిరుపతి  ఎంపీగా, బద్వేల్ ఎమ్మెల్యే గా పోటీచేసి తెలుగు రాష్ట్రాలలోని రాజకీయంలో సంచలనమైన వ్యక్తిగా పేరుగాంచారని తెలిపారు. డా॥గోదా రమేష్ కుమార్ నవతరం పార్టీ కొరకు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు.

అనంతరం గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే నవతరం పార్టీ తరఫున ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని తనపై నమ్మకముంచి నవతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.గణేష్ కుమార్, నవతరం పార్టీ చిలకలూరిపేట కన్వినర్ బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు ఆహార పంచిన శ్రీజ కంప్యూటర్స్

Satyam NEWS

రంజాన్ తోఫా అందచేసిన గోల్నాక డివిజన్ కార్పొరేటర్

Satyam NEWS

రూ.410 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం

Satyam NEWS

Leave a Comment