నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని లాక్ డౌన్ నేపథ్యంలో కల్వకుర్తి బస్టాండ్ లో 50 మంది నిరుపేదలకు, అభాగ్యులకు, యాచకులకు, గురువారం మధ్యాహ్నం శ్రీజ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీజ కంప్యూటర్ నిర్వాహకులు మాట్లాడుతూ కరుణ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు లాక్ డౌన్ దృశ్య ప్రజలు ఎవరు రోడ్లపైకి రాకుండా ఉండాలని పట్టణంలోని అన్ని దుకాణాలు మూసి వేయడంతో యాచకులు, కూలీలు ఆకలితో పస్తులు ఉంటున్నారు అని తమ ఇళ్లలో కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నిరాశ్రయులయ్యారు అని ఇలాంటప్పుడే వ్యాపారులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వారన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని అన్నారు.