రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తోఫా అందచేశారు. పేద కుటుంబాలకు చెందిన వారు కూడా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
రంజాన్ పండుగ శుభ సందర్భంగా దుర్గా నగర్ లోని మైనార్టీ సోదర, సోదరీమణులు రంజాన్ తోఫా ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో బాటు టి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్బు, ఇలియాస్, అక్బర్, కొమ్ము శీను, నర్సింగ్ యాదవ్, ఉమేష్, ప్రణీత్, రాము తదితరులు పాల్గొన్నారు.