పవన్ కల్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు విజృంభించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో ఉధృతంగా పాల్గొంటున్నారు. వేలాది మంది తమ రోడ్ల దుస్థితిని ఫొటోలు వీడియోలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో విస్తృత ప్రాచుర్యంలో ఉంది. ట్విట్టర్లో 1, 2 స్థానాల్లో కొనసాగుతోంది. క్యాంపెయిన్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే 1.66 లక్షల ట్విట్లు రావడం విశేషం.
ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా #GoodmorningCMSir హ్యాష్ ట్యాగ్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా కృషి చేస్తున్నారు. ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల మీదా ట్రెండింగ్ జోరు కనిపిస్తోంది.