తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని కరోనా కారణంగా రెండు రోజుల పాటు వేసివేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత గోవిందరాజస్వామి ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. గోవింద రాజ స్వామి గుడి శానిటరీ ఇన్స్పెక్టర్ కు కరోనా రావటంతో తిరిగి ఆలయాన్ని రెండు రోజుల పాటు అంటే నేడు రేపు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
జ్వరం, జలుబు, దగ్గులతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్ లు చేయగా ఈరోజు టెస్ట్ ల రిజల్ట్స్ రావటంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆలయం సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలోని మిగతా సిబ్బందికి కూడా కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.