ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పలు ఆలయాలను సందర్శించారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు అంబర్పేట్ డివిజన్లోని ప్రేమ్ నగర్, పటేల్ నగర్ లోని ఆలయాలకు వెళ్లారు. అక్కడ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఆత్రేయ, అంబర్పేట్ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు సత్తి బాబు, బిజెపి అంబర్ పేట్ డివిజన్ అధ్యక్షుడు నాగభూషణం చారి, చిన్న, గణేష్, మహేష్ ముదిరాజ్, సంతోష్ చారి, సిపిఎల్ ఆలయ నిర్వాహకులు వీరు, తిరుపతి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట