భక్తుల పాలిట కల్పతరువు, కోరిన కోర్కెలు తీర్చే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు పంచామృతాభిషేకాలు అష్టోత్తర పారాయణం ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని షేరల్లి వీధిలో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృత అభిషేకాలు అష్టోత్తర పారాయణం నిర్వహించి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు, సంప్రతీ మోహన్ మదన్ మోహన్,సుధాకర్,వ్యాసరాజ్, రాఘవేంద్ర చారి,ధనుంజయ చారి, భక్తులు పాల్గొన్నారు.
previous post
next post