ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ నేడు ఆర్ధిక మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిశారు.
ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామపంచాయతీ మైనింగ్ రాయల్టీ సంబంధించిన బిల్లులను విడుదల చెయ్యాలని ఆర్ధిక మంత్రిని కోరారు.
నిధులు విడుదల చేసి గ్రామ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
జిల్లా సమగ్ర అభివృద్ధి పనులు పైన చర్చించారు. ఈ కార్యక్రమాలలో మల్లంపల్లి గ్రామ సర్పంచ్ చందా కుమార్,ఎంపీటీసీ మల్లంపల్లి మాచర్ల ప్రభాకర్,రాష్ట్ర యువజన నాయకులు ఎర్వ వెంకటాద్రి ఉన్నారు.