హెచ్.సి.యు యూనివర్సిటీ లీజ్ ను పొడిగించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్. సి.యు లీజును పొడిగించాలని యూనివర్సిటీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి , మాదాపూర్ కంటేస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ ,కంటేస్టడ్ కార్పొరేటర్ ఏల్లేష్ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయ స్కూల్ ను హెచ్.సి.యు ప్రాంగణంలో లీజుకు తీసుకుని 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు కొనసాగిస్తున్నారని, 2024 లో వారి లీజు ముగియవస్తుందని కొన్ని సంవత్సరాలుగా ఒక్కొక్క తరగతి చొప్పున తగ్గించుకుంటూ వస్తున్నారని, 7,8,9 తరగతులు పిల్లలు ఇంకా చదువుకుంటుండగా కేంద్రీయ విద్యాలయ వారు మేము కొనసాగించలేమని జీతాలు ఇవ్వలేకపొతున్నామని చెప్పడంతో, విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందేమోనని తల్లిదండ్రులు భయాందోళనతో తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సమస్యను వారికి తెలియజేసి వినతి పత్రం అందజేయగా వారు సానుకూలంగా స్పందిస్తూ హెచ్.సి.యు వారితో సంభాషించి లీజు ను పొడిగించాలని కోరగా వారు స్పందించారని, ఈరోజు వారికి మా మద్దతు తెలుపుతూ లీజు పొడిగించే వరకు పోరాటం చేద్దామని , ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి విద్యార్ధుల కు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో రమేష్, చంద్రయ్య యాదవ్ , ఆంజనేయులు, నరసింహ, పద్మ, వరలక్ష్మి , రేణుక ,అరుణ, నాగులు , విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.