36.2 C
Hyderabad
May 8, 2024 18: 07 PM
Slider హైదరాబాద్

అందరిని గౌరవించడం హైదరాబాద్ కల్చర్

#kachiguda

హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందనీ, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా కొనసాగుతున్న  హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. 

కన్నడిగుల కోసం హైదరాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్దరించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు మరియు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  హైదరాబాద్ కాచిగూడలో గల  ‘కర్నాటక సాహిత్య మందిర’  పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సిఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని  తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సిఎం సూచించారు. కాగా తమ విజ్ఞప్తి మేరకు రూ. 5 కోట్లను మంజూరు చేసినందుకు సిఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

Satyam NEWS

పూర్తి స్థాయిలో సర్వే చేసి పేదలకు న్యాయం చేయాలి

Satyam NEWS

తెలుగు భాషను కాపాడుకోవడం మన బాధ్యత

Satyam NEWS

Leave a Comment