కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం ఫిబ్రవరి 11న తిరుమలలో ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు.
అక్కడున్న శ్రీ పద్మావతి పరిణయ మండపంలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు శ్రీ పురందరదాస కీర్తనలను బృందగానం చేస్తారు.