కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కాచిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నె ఉమరమేష్ యాదవ్ అన్నారు.
శుక్రవారం డివిజన్ లోని ఇందిరనగర్ లో సీజినల్ వ్యాధులు రాకుండా, జ్వరం, దగ్గు, బిపి, షుగర్ కడుపు నొప్పి వారి కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఆమె పాల్గొని రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సు ఇంద్ర , ఏఏన్ రమాదేవి, ఆశా వర్కర్ సబితా, అనురాధ, సోని తదితరులు పాల్గొన్నారు.