కలెక్టరేట్ కు ఫ్లెక్సీలు కట్టి కుంభకోణాలను సాక్ష్యాలతో సహా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వినూత్నంగా నేడు నిరసన తెలిపారు. వైసీపీ నేతలు తమ ధన దాహానికి వ్యవస్థలను కుప్పకూల్చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు తెలియకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల రికార్డులు మారిపోతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. భూకుంభకోణాలకు పాల్పడిన అసలు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనూరాధ, జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్,, జెన్ని రమణయ్య, బొమ్మి సురేంద్ర, ఒట్టూరు సంపత్ యాదవ్, తలచీరు మస్తాన్ బాబు, గుమ్మడి రాజాయాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, గాలి రామక్రిష్ణారెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.