కడపజిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసిపి కి చెందిన రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
మృతిచెందిన వారిని పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 )గా గుర్తించారు. ఇరువురు బంధువులు కాగా వీరి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఉదయం ప్రసాద్ రెడ్డి ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు. తనను చంపుతా డెమో అన్న ఆందోళనతో ప్రసాద్ రెడ్డి (కాబోయే మండలాధ్యక్షుడు)
తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధి రెడ్డి పై రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అదే తుపాకితో ప్రసాద్ రెడ్డి కూడా తన లైసెన్సు రివాల్వర్ తో ఆయనే కాల్చుకొని మృతి చెందాడు.