అంగన్ వాడీ,ఆశా వర్కర్ల ఆందోళనతో పోలీసు యంత్రాంగం అలెర్ట్..!
విజయనగరం కలెక్టరేట్…మరోసారి వార్తలకెక్కింది. అదీ…ఈ సారి ఏ ఆందోళనతోనో… లేక ఏ ధర్నాతోనో కాదు…సాక్షాత్…ప్రభుత్వానికి దాసులంటూ అలాగే గడచిన నాలుగేళ్లుగా…రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలలో పని చేస్తున్న శాఖ కు చెందిన సిబ్బంది.అదేనండీ…ఖాకీ డ్రస్ వేసుకున్న పోలీసులు. మీరు చదివింది నిజమే… విషయం ఏంటంటే…కలెక్టరేట్ వద్ద ఒ వైపు అంగన్ వాడీలు ధర్నా మరో వైపు..ఆశా వర్కర్ల ఆందోళన. రెండు చోట్ల ఆందోళన,ధర్నా చేస్తున్నవారు.మహిళలే కావడం విశేషం. అంగన్ వాడీలు…గడచిన నాలుగేళ్లుగా ధర్నా చేస్తుంటే..ఆశా వర్కర్లు…36 గంటల పాటు నిరసనకు పిలుపు ఇచ్చి మరీ..కూర్చున్నారు.
కాగా ఒక్క రోజు ముందే…అంగన్ వాడీలు..కలెక్టరేట్ ఎదుటే మానవహారం నిర్వహించి..ఓ రకంగా పోలీసులకు పని చెప్పారు.అయితే అప్పుడు..కేవలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచీ ఒక సీఐ…ఇద్దరు ఎస్.ఐలు మాత్రమే..బందోబస్తుకు వచ్చారు .కాగా నిన్నటి మానవహారంకు జనసేన మద్దతు ఇవ్వడంతో…ఆ పార్టీ నేత ప్రముఖ వ్యాపార వేత్త గురాన అయ్యలు,త్యాడా రామకృష్టలు కూడా హాజరయ్యారు. దీంతో పరిస్థితిని పరిశీలించిన పోలీసులు..మరుసటి రోజు…బందోబస్తుతో రంగంలోకి దిగారు.
విజయనగరం పోలీస్ డివిజన్ పరిధిలో అదీ సర్కిల్ ప్రాంతంలో ఉన్నే అన్ని పీఎస్ ల నుంచీ మహిళా పోలీసులను అలాగే ఎస్ ఐ లను ఇలా మొత్తం….సుమారు…50 మంది వరకు మహిళా సిబ్బంది రప్పించి మరీ..పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.ఈ క్రమంలో కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద బారికేడ్లను అమర్చి…తాళ్లతో కట్టి…అవుట్ గేట్ వద్ద… ముగ్గురు సీఐలు.. ఐదురుగు ఎస్ఐలు, ముగ్గురు మహిళా ఎస్ఐలు,నలుగురు ఏఎస్ఐలు వీర కాక…ఎస్టీఎఫ్ సిబ్బందితో చీమ కూడా కలెక్టరేట్ లోపలకు వెళ్లకుండా బందోబస్తు పెట్టి మరీ.. పోలీసు బలగం ఏంటో సామాన్య ప్రజలకు చూపించారు.