భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున గోల్నాక చౌరస్తాలోని పురాతన సైకిల్ పంచర్ దుకాణం మడిగి కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో మడిగేలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత 50 ఏళ్లుగా శాంతినగర్ కు చెందిన వెంకటి అనే వ్యక్తి ఈ మడిగెలో సైకిల్ పంచర్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకటి భార్య పోగా, నలుగురు కుమార్తెలను ఆయన పంచర్ దుకాణాలు పనిచేస్తూ పోషిస్తున్నాడు. మడిగి కూలిపోవడంతో వెంకటి ఉపాధి కోల్పోయాడు. నిరుపేదనైన తనను ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆదుకోవాలని వెంకటి విజ్ఞప్తి చేస్తున్నాడు.
సత్యం న్యూస్, అంబర్పేట