సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశ్ ముఖ్ అరుణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకులను,కార్యకర్తలను, అభిమానులను కోరారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతు డిక్లరేషన్ ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల తేదీని ప్రకటించాలని అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గుగులోతు బాలాజీ,లకావత్ సైదులు, మాజీ ఎంపిపి నిర్మల,వల్లెల నాగిరెడ్డి,మల్ రెడ్డి కృష్ణారెడ్డి,రేపాకుల కోటయ్య, వేపలమాధారం సర్పంచ్ సునీతా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్