సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రము లోని నిరుపేద కుటుంబానికి చెందిన ముస్లిం సోదరుడి వివాహానికి ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు ఆర్థిక సహాయం అందజేశారు.
మేళ్ళచెరువు గ్రామం లోని ఓజో ఫౌండేషన్ సభ్యుడు యాకూబ్ బాబా ద్వార విషయం తెలుసుకున్న వెంటనే రఘు స్పందించి ఆదివారం వివాహ కార్య క్రమానికి ఓజో ఫౌండేషన్ ఇన్చార్జ్ కుక్కల వెంకన్న ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మేళ్ళచెరువు గ్రామనికి తన వంతు సహాయం అందిస్తారని అన్నారు. మన గ్రామనికి రఘు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ సభ్యులు బేత సాయిరెడ్డి,శివ శంకర్ యాదవ్,సౌదాసోతు రవి,నక్కని నరేష్, మీరా,ఇస్మాయిల్,నజీర్,అమీర్,విజయ్, నాగరాజు,లతీఫ్ గ్రామం పెద్దలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్